నేడు మునగపాక మండలం గంటవానిపాలెం గ్రామం అంబేద్కర్ కాలనీ నుంచి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కు చెందిన సుమారు 30 కుటుంబాలు సర్పంచ్ కూన అప్పలరాజు, మాజీ సర్పంచ్ హరిగా రమణ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కవరపు శ్రీను ఆధ్వర్యంలో అధికార పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు వీరందరికీ ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గారు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వీరందరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు, జనసేన మండల అధ్యక్షులు టెక్కలి పరుశురాం, మండల ప్రధాన కార్యదర్శి కాల్ల చంద్రమోహన్, కర్రీ రామ నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు
పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
2024-11-15 14:46:36
అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.
2024-11-14 10:22:20
ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు
2024-11-13 11:02:01
పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం
2024-11-04 17:03:03